‘లూసిఫర్’ రీమేక్లో ఆ పాత్ర లేపేశారా?
ABN , First Publish Date - 2021-07-14T01:12:45+05:30 IST
'ఆచార్య' చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న చిత్రం 'లూసిఫర్' రీమేక్. మోహన్రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈసరికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం
'ఆచార్య' చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న చిత్రం 'లూసిఫర్' రీమేక్. మోహన్రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈసరికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా ఇబ్బందులు రాకుండా ఉంటే.. ఇప్పటికే ఈ చిత్రం కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తయి ఉండేది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్పైకి వెళ్లలేదు. ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' చిత్ర షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లేందుకు మెగాస్టార్ సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్గా రివీలైన ఆయన లుక్ కూడా ఈ సినిమా కోసం చిరు రెడీ అవుతున్నారనేలా తెలియజేసింది.
అయితే ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి.. ఏదో రకంగా గాసిప్స్ వ్యాపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 'లూసిఫర్'లో మంజు వారియర్ చేసిన పాత్ర విషయంలో ఎందరో నటీమణుల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత మోహన్రాజా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారనేలా వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తూనే వస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో గాసిప్ టాలీవుడ్ సర్కిల్స్లో వైరల్ అవుతోంది. 'లూసిఫర్'లో సెకండ్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన విషయం తెలిసిందే. ఆయన ఆ చిత్రానికి దర్శకుడు కూడానూ. కాగా, చిరు చేస్తున్న ఈ రీమేక్లో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తీసేస్తున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. ఈ పాత్రను పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో హీరోయిన్తో కూడిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు డాన్గా చిరు మారిన తీరును చూపించనున్నారట. ఈ మార్పును చిరు కూడా అంగీకరించారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.