పాయసం, మిఠాయిలు వద్దు!

ABN , First Publish Date - 2021-10-20T09:13:09+05:30 IST

తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యే వరకూ తమ ఇంట్లో పాయసం, మిఠాయిలు లాంటి తినుబండారాలను వండకూడదని సిబ్బందికి గౌరీఖాన్‌ ఆదేశాలిచ్చారట...

పాయసం, మిఠాయిలు వద్దు!

తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యే వరకూ తమ ఇంట్లో పాయసం, మిఠాయిలు లాంటి తినుబండారాలను వండకూడదని సిబ్బందికి గౌరీఖాన్‌ ఆదేశాలిచ్చారట. డ్రగ్‌ రాకెట్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌ ఈనెల 3న అరెస్టై జైలుకే పరిమితమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి షారూఖ్‌ఖాన్‌, గౌరీఖాన్‌ దంపతులు దుఃఖంలో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పాయసం వండుతున్న వంట సిబ్బందిని గౌరీఖాన్‌ వారించారట. ఆర్యన్‌ ఖాన్‌ ఇంటికొచ్చేదాకా అలాంటివి చేయవద్దని చెప్పారట. ఏటా ఈద్‌, దీపాళి పర్వదినాల్లో వారి స్వగృహం మన్నత్‌ ప్యాలెస్‌ను సుందరంగా అలంకరిస్తారు. ఇప్పుడు ఆర్యన్‌ఖాన్‌ జైల్లో ఉండడంతో పండుగ సంబరాలకు దూరంగా ఉన్నారు. 


Updated Date - 2021-10-20T09:13:09+05:30 IST