ఎవరూ కనికరం చూపరు

ABN , First Publish Date - 2022-01-25T05:56:36+05:30 IST

‘‘మన జయాపజయాలకు మనమే బాధ్యులం. గెలిస్తే చాలామంది భుజాన వేసుకుంటారు. ఓడిపోతే మాత్రం ఎవరూ కనికరం చూపించరు’’...

ఎవరూ కనికరం చూపరు

‘‘మన జయాపజయాలకు మనమే బాధ్యులం. గెలిస్తే చాలామంది భుజాన వేసుకుంటారు. ఓడిపోతే మాత్రం ఎవరూ కనికరం చూపించరు’’ అంటున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికల్లో పూజా ఒకరు. చిత్రసీమలో మన స్థాయి ఏమిటన్నది మన విజయాలే నిర్ణయిస్తాయని, అదృష్టం కంటే.. ప్రతిభే శాశ్వతం అని చెబుతున్నారామె. ‘‘గెలిస్తే సంబరాలు చేసుకోవడానికి చాలామంది వస్తారు. ఓటమి మాత్రం ఒంటరిదే. ఎవరూ జాలి పడరు. గెలుపు వచ్చాక ‘ఇది నా సొంతం’ అని ఎంత నమ్మకంగా చెబుతామో, ఓటమికి కూడా అలానే బాధ్యత వహించాలి. రెండింటినీ ఒకేలా చూసినప్పుడు మాత్రమే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం. నా తొలి చిత్రం ఫ్లాప్‌ అయినప్పుడు నా మానసిక స్థితి నాకు తెలుసు. అందులోంచి బయటకు రావడానికి చాలా కాలం పట్టింది. ఆ తరవాత ఓటమిని ఆహ్వానించడం అలవాటు చేసుకున్నా’’ అని చెప్పారామె. 


Updated Date - 2022-01-25T05:56:36+05:30 IST