ఇలాంటి స్క్రిప్ట్ వింటే ఎవరైనా ఎగ్జయిట్ అవ్వాల్సిందే: నిత్యామీనన్
ABN , First Publish Date - 2021-11-28T02:52:48+05:30 IST
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా.. డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన చిత్రం ‘స్కైలాబ్’. 1979లో సాగే పీరియాడిక్..

సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా.. డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన చిత్రం ‘స్కైలాబ్’. 1979లో సాగే పీరియాడిక్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిత్యామీనన్ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘స్కైలాబ్ స్క్రిప్ట్ వింటే ఎవరైనా ఎగ్జయిట్ అవుతారు. అంత పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్. స్కైలాబ్ ట్రీట్మెంట్ చాలా బాగా అనిపించింది. తెలుగు సినిమాకు అది చాలా కొత్తగా అనిపించింది. తెలంగాణలోని చిన్న గ్రామంలో జరిగే కథే.. కానీ, బ్యాక్గ్రౌండ్లో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది. సినిమాలో అలాంటి పారడాక్సికల్ ట్రీట్మెంట్ నాకు చాలా ఇష్టం. అది వినగానే వెంటనే ఒప్పేసుకున్నా. మంచి సినిమా తీయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అలాంటి తరుణంలో నేను కూడా ప్రొడ్యూస్ చేస్తానని చెప్పా. అసలు కథ విన్నప్పుడే.. ఖచ్చితంగా ఇలాంటి సినిమా స్క్రీన్ మీదకు రావాలని అనుకున్నా. కానీ, కొన్ని ఇష్యూల వల్ల నేను అనుకోకుండా నిర్మాతగా మారాను. నటిస్తూ నిర్మాతగా కూడా అంటే కొద్దిగా కష్టమే. షూట్ టైమ్లో అంతా పృథ్వి మేనేజ్ చేశాడు. షూట్ తర్వాత నేను మేనేజ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి నటించేటప్పుడు ఇబ్బంది రాలేదు. నాకు నిజంగా స్కైలాబ్ గురించి తెలియదు. ఇంటికెళ్లి అమ్మానాన్నలను అడిగితే, దాని గురించి చాలా కథలు చెప్పారు. మరి ఇన్నాళ్లు ఎందుకు నాతో చెప్పలేదు అని అడిగా. అప్పుడనిపించింది నాకు.. మన జనరేషన్కి దీని గురించి ఏమీ తెలియదు. పాత జనరేషన్ వాళ్లకు తెలుసు. ఆ కనెక్ట్ ఉంటుంది. స్కైలాబ్ గురించి ఎవరిని అడిగినా వాళ్లకో కథ ఉంది. సో అందరూ కనెక్ట్ అవుతారనిపించింది.
ఇందులో నటించిన సత్య అండ్ రాహుల్తో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. ఈ సినిమా 3 కేరక్టర్ల గురించి. 3 లీడ్స్ ఉంటాయి. రాహుల్, సత్యకి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నాది సెపరేట్ ట్రాక్. వాళ్లతో యాక్ట్ చేయలేదు. అందుకే ఇంటరాక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు సినిమా చూస్తుంటే, వాళ్లిద్దరూ చాలా ఫ్యాబులెస్గా పెర్పార్మ్ చేశారు. బండలింగం పల్లి అనే విలేజ్లో జరుగుతుంది సబ్జెక్ట్. కానీ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, కలర్ ప్యాలెట్స్, ప్రొడక్షన్ డిజైన్ పరంగా రిఫ్లెక్ట్ కాదు. ఇందులో రా లుక్ ఉండదు. వెరీ కలర్ఫుల్, పాలిష్డ్ లుక్, శాచురేటెడ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం మేర్సిడోనియాలో 40-50 పీస్ ఆర్కెస్ట్రాతో సౌండ్ ట్రాక్ చేశాం. సౌండ్ ట్రాక్ అంతా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్తో ఉంటుంది. ఈ సినిమాకు నేనైనా, పృథ్వి అయినా చిన్న విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. ఇది ఆ కైండ్ ఆఫ్ సినిమా. మేం ఈ సినిమాతో డబ్బు పోగొట్టుకున్నా, ఆ పర్టిక్యులర్ సీన్ కోసం కాంప్రమైజ్ అయినా ఫర్వాలేదన్నట్టే ఫీలయ్యాం. సో ఇది ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ సినిమా మాకు మోర్ ఇంపార్టెంట్ దేన్ మనీ.
ఈ సినిమాలో తెలంగాణ యాస మాట్లాడా. అదీ సింక్ సౌండ్లో చేశా. థ్రూ అవుట్ సినిమా అలాగే చేశా. ఒక్క వర్డ్ కూడా కరెక్షన్ లేదు. డబ్బింగ్ అవసరం లేదన్నారు. ఈ సినిమా కోసం ట్రైనింగ్ అని కాదు కానీ, వినడం, చదవడం, ఆ యాక్సెంట్లో మాట్లాడుతున్నా. నాకు తెలంగాణ యాక్సెంట్ చాలా ఇష్టం. చాలా అందంగా ఉంటుంది వినడానికి. ఇందులో జర్నలిస్ట్గా చేశా. ఇంటీరియర్స్ చాలా వరకు సెట్స్లో చేశాం. తెలంగాణ విలేజెస్ చాలా బ్యూటీఫుల్గా ఉంటాయి. హైదరాబాద్ పరిసరాల్లో చాలా చేశాం. నా పాత్రని ఛాలెంజింగ్గా కాదు. చాలా సరదాగా చేశా. నెరేషన్ వింటున్నప్పుడే నాకు తెలిసిపోతుంది. అందుకే కేరక్టర్లోకి వెళ్లడానికి టైమ్ తీసుకోను. ఒక మంచి సినిమాని, కథని ప్రేక్షకులకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది..’’ అని అన్నారు.