చివరి షెడ్యూల్‌లో నిఖిల్ చిత్రం..!

ABN , First Publish Date - 2022-01-29T15:48:44+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం '18 పేజెస్' చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్టు తాజా సమాచారం. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

చివరి షెడ్యూల్‌లో నిఖిల్ చిత్రం..!

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం '18 పేజెస్' చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్టు తాజా సమాచారం. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ పాటికే షూటింగ్ పూర్తై ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేయాల్సింది. కానీ, కరోనా వేవ్స్ కారణంగా ఆలస్యం అయింది. కాగా, ఇటీవల చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ను మేకర్స్ ప్రారంభించి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారట. మరో 10 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను వీలైంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక నిఖిల్ దీనితో పాటు 'కార్తికేయ -2'లోనూ నటిస్తున్నాడు. ఇందులో కూడా హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. చందు మొండేటి దర్శకుడు.

Updated Date - 2022-01-29T15:48:44+05:30 IST