ఆ సినిమా ఒప్పుకునే ముందు కొడుకు, కోడలు సలహా తీసుకున్నానంటున్న Neetu Kapoor

ABN , First Publish Date - 2022-06-20T15:54:17+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తల్లిద్రండ్రులు రిషి కపూర్ (Rishi Kapoor), నీతూ కపూర్ నటులు..

ఆ సినిమా ఒప్పుకునే ముందు కొడుకు, కోడలు సలహా తీసుకున్నానంటున్న Neetu Kapoor

బాలీవుడ్ యువ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తల్లిద్రండ్రులు రిషి కపూర్ (Rishi Kapoor), నీతూ కపూర్ నటులు అనే విషయం తెలిసిందే. అయితే.. రిషితో పెళ్లి తర్వాత నీతూ సినిమాలకు స్వస్తి పలికారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత తాజాగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘జగ్ జగ్ జీయో’ సినిమాతో నీతూ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జూన్ 24న విడుదల కానుంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో నీతూ కపూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


నీతూ కపూర్ మాట్లాడుతూ.. ‘నా భర్త మరణంతో నేను చాలా దారుణమైన స్థితిలో ఉన్నాను. ఆ సమయంలో కరణ్, రణబీర్ మా ఇంట్లో ఉన్నారు. అప్పుడు నా కొడుకు నా దగ్గరకి నేను మళ్లీ యాక్టింగ్ చేయాలని చెప్పాడు. దాంతో మరుసటి రోజూ స్క్రిప్ట్‌తో వస్తానని చెప్పి వెళ్లాడు. తర్వాత రోజు రాజ్‌తో కలిసి వచ్చాడు. కథ చాలా బావుంది. డైలాగ్‌లు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. నేను చేస్తానని చెప్పాను. ఈ స్టోరీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చారు.


నీతూ ఇంకా మాట్లాడుతూ.. ‘వారు చేయబోయే సినిమాలపై ఏదైనా సందేహం వచ్చినప్పుడు.. రెండో ఓపినియన్ కోసం నాకు ఆ స్క్రిప్ట్స్ ఇస్తారు. నేను పరిశీలించి నా అభిప్రాయం చెబుతాను. అలా అని ప్రతిసారి కాదు. అయితే.. నా కొత్త సినిమా గురించి రణ్‌బీర్, అలియా భట్‌ (Alia Bhatt)కి  చూపించి.. వారి సలహాలు తీసుకున్నాను. వారు సైతం నాకు మంచి సజెషన్స్ ఇచ్చారు’ అని తెలిపారు.

Updated Date - 2022-06-20T15:54:17+05:30 IST