నయన్-విఘ్నేష్ ఇది నిజమేనా..?

ABN , First Publish Date - 2022-01-16T14:54:07+05:30 IST

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ విదేశాలలో భారీగా పెట్టుపబడులు పెడుతున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.

నయన్-విఘ్నేష్ ఇది నిజమేనా..?

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ విదేశాలలో భారీగా పెట్టుపబడులు పెడుతున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. కెరీర్ పరంగా ఇద్దరు చాలా బీజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో 'కథు వాకుల రెండు కాదల్' అనే మల్టీస్టారర్ చిత్రం చేసింది నయన్. ఇందులో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, నయనతార, విఘ్నేష్ శివన్ దుబాయ్‌కి చెందిన ఆయిల్ కంపెనీలో ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్‌లో కూడా దీనికి సంబంధించి చరచలు సాగుతున్నాయట. ఆయిల్ కంపెనీలో పెట్టుబడులు అంటే అంత చిన్న విషయం కాదంటున్నారు. ఏదేమైనా నిర్మాతలుగా సక్సెస్ అయిన ఈ జంట ఇప్పుడు కొత్త బిజినెస్‌లో ఎంటరవబోతుండటం హాట్ టాపిక్‌గా మారింది.  

Updated Date - 2022-01-16T14:54:07+05:30 IST