Nayanthara: విఘ్నేశ్ శివన్ కన్నా ముందు చెట్టుతో పెళ్ళి?
ABN , First Publish Date - 2021-10-21T15:56:42+05:30 IST
సౌత్ సూపర్ స్టార్ నయనతార నటించిన, రజినీకాంత్ ‘అన్నాత్త’ మూవీ ఈ దీపావళికి విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇంకా పలువురు స్టార్ హీరోలతో సినిమాల్ని లైన్ లో పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి గుళ్ళూ గోపురాల్ని దర్శించుకుంటోంది. రీసెంట్ గా ముంబైలోని షిర్డీ సాయిబాబా టెంపుల్ని, సిద్ధివినాయక స్వామి టెంపుల్ని దర్శించుకున్న ఆమె.. కర్నాటకలోని మరో ప్రసిద్ధ ఆలయాన్ని కూడా దర్శించుకుంది.
సౌత్ సూపర్ స్టార్ నయనతార నటించిన, రజినీకాంత్ ‘అన్నాత్త’ మూవీ ఈ దీపావళికి విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇంకా పలువురు స్టార్ హీరోలతో సినిమాల్ని లైన్ లో పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్తో కలిసి గుళ్ళూ గోపురాల్ని దర్శించుకుంటోంది. రీసెంట్ గా ముంబైలోని షిర్డీ సాయిబాబా టెంపుల్ని, సిద్ధివినాయక స్వామి టెంపుల్ని దర్శించుకున్న ఆమె.. కర్నాటకలోని మరో ప్రసిద్ధ ఆలయాన్ని కూడా దర్శించుకుంది. త్వరలో బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ ను పెళ్ళిచేసుకోబోతున్నట్టు మొన్నామధ్య రివీల్ చేసిన ఆమె.. ముందుగా చెట్టును పెళ్ళిచేసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నయనతారకి కుజదోషం ఉందట. విఘ్నేశ్ శివన్కి లేదట. నిజానికి కుజదోషం ఉన్న అమ్మాయికి, కుజదోషం ఉన్న అబ్బాయితోనే పెళ్ళి జరిపించాలన్నది శాస్త్రం. అందుకే వీరిద్దరి మధ్య వివాహం దోషకరమైనదని వారి వంశస్థుల నమ్మకం. దాన్ని నివారించడానికి విఘ్నేశ్ శివన్ కన్నా ముందు ఒక చెట్టుచేత తాళి కట్టించుకొని ఆ తర్వాత విఘ్నేశ్ శివన్ ను ఆమె పెళ్ళాడనుందని సమాచారం. ఈ డిసెంబర్ లో కానీ, వచ్చే ఏడాది ప్రధమార్ధంలో కానీ వీరిద్దరూ పెళ్ళిచేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆ లోపు వీరిద్దరి కమింట్ మెంట్స్ పూర్తవుతాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. నయనతార పెళ్ళి చేసుకున్న తర్వాత సినిమాలకు గుబ్ బై చెప్పనుందట.