వళుత్తియూరు ఆలయంలో Nayanathara - Vighnesh Shivan ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2022-05-24T19:17:46+05:30 IST
కోలీవుడ్ ప్రేమజంట Nayanathara, Vighnesh Shivan లు వచ్చేనెల్లో పెళ్ళిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట తమ పెళ్ళి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇందులో ఆ భాగంగా ఆ ఇద్దరూ తమ వివాహం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని పలు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కోలీవుడ్ ప్రేమజంట Nayanathara, Vighnesh Shivan లు వచ్చేనెల్లో పెళ్ళిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట తమ పెళ్ళి పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇందులో ఆ భాగంగా ఆ ఇద్దరూ తమ వివాహం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని పలు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవలే తిరుమల వెళ్ళి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు తిరుచ్చి జిల్లాలోని తమ కులదైవం ఆలయానికి వెళ్ళారు. చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లిన వీరిద్దరూ అక్కడ నుంచి తంజావూరు జిల్లా అయ్యంపేట వళుత్తియూరికి వెళ్ళి అక్కడ ఉన్న కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు తమ మొక్కును తీర్చుకుని, తొలి పెళ్ళి పత్రికను తమ కులదైవం పాదాల చెంత పెట్టినట్టుట్లు సమాచారం. వీరిద్దరి వివాహ ముహూర్తం జూన్ నెల 9వ తేదీకి ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల నయనతార (Nayanathara ) తన ప్రియుడి దర్శకత్వంలో ‘కాత్కువాకుల రెండు కాదల్’ (Kathuvakkula rendu kathaql) చిత్రంలో నటించగా.. కోలీవుడ్లో దానికి మంరి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) , సమంత (Samantha) ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను తన కెరీర్ లోనే ప్రత్యేకమైనది భావిస్తున్నట్టు నయన్ చెప్పింది. కాగా నయన్ ప్రస్తుతం తన పెళ్ళి కారణంగా ఏ సినిమాలోనూ నటించడం లేదు.