షిరిడి సాయిబాబాని దర్శించుకున్న నయనతార, విగ్నేష్ శివన్..

ABN , First Publish Date - 2021-10-21T14:10:57+05:30 IST

త్వరలో ఒక్కటి కాబోతున్న కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ తాజాగా శ్రీ శిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విగ్నేష్ శివన్.. ఆ తర్వాత ముంబైలోని మహాలక్ష్మి ఆలయం,

షిరిడి సాయిబాబాని దర్శించుకున్న నయనతార, విగ్నేష్ శివన్..

త్వరలో ఒక్కటి కాబోతున్న కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ తాజాగా శ్రీ శిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విగ్నేష్ శివన్.. ఆ తర్వాత ముంబైలోని మహాలక్ష్మి ఆలయం, సిద్ధి వినాయక్ ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా షిరిడి చేరుకుని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఆ సినిమాలను పూర్తిచేసి విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. 


సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'అన్నాత్తే'లో హీరోయిన్‌గా నటించింది నయనతార. ఈ మూవీ నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో 'కాతు వాక్కుల రెండు కాదల్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలతో పాటే అట్లీ, షారుఖ్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'లయన్'లో హీరోయిన్‌గానూ నయన్ కనిపించబోతోంది. అంతేకాదు సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్‌తో కలిసి ఆమె సినిమాలును కూడా నిర్మిస్తోంది.  

Updated Date - 2021-10-21T14:10:57+05:30 IST