పృధ్విరాజ్ సుకుమారన్ జోడీగా నయనతార

ABN , First Publish Date - 2021-12-04T22:16:08+05:30 IST

మలయాళ యంగ్ సూపర్ స్టార్ పృధ్విరాజ్ ఓ పక్క మోహన్ లాల్ హీరోగా ‘బ్రోడాడీ’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తూనే .. మరో పక్క హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘కడువ’ (పులి) అనే సినిమాలో నటిస్తున్న పృధ్విరాజ్.. అంతకు ముందే ‘గోల్డ్’ అనే మూవీని కంప్లీట్ చేశారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండడం విశేషంగా మారింది. ‘ప్రేమమ్’ సినిమాతో దక్షిణాదిన క్రేజీ డైరెక్టర్ అనిపించుకున్న అల్ఫో్న్స్ పుత్రెన్ ఈ సినిమాకి దర్శకుడు.

పృధ్విరాజ్ సుకుమారన్ జోడీగా నయనతార

మలయాళ యంగ్ సూపర్ స్టార్ పృధ్విరాజ్ ఓ పక్క మోహన్ లాల్ హీరోగా ‘బ్రోడాడీ’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తూనే .. మరో పక్క హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘కడువ’ (పులి) అనే సినిమాలో నటిస్తున్న పృధ్విరాజ్.. అంతకు ముందే ‘గోల్డ్’ అనే మూవీని కంప్లీట్ చేశారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండడం విశేషంగా మారింది. ‘ప్రేమమ్’ సినిమాతో దక్షిణాదిన క్రేజీ డైరెక్టర్ అనిపించుకున్న అల్ఫో్న్స్ పుత్రెన్ ఈ సినిమాకి దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 


వార్ అండ్ లవ్ నేపథ్యంలో డిఫరెంట్ స్ర్కీన్ ప్లేతో సాగే ఈ సినిమా ఇటు పృధ్విరాజ్ కి, అటు నయనతారకి మంచి పేరు తెచ్చిపెడుతుందని దర్శకుడు చెబుతున్నాడు. మలయాళం మాతృభాష అయినప్పటికీ నయనతార..  తమిళ చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘నిళల్’ అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన నయన్.. ఇప్పుడు ‘గోల్డ్’ మూవీతో రానుండడం విశేషం. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Updated Date - 2021-12-04T22:16:08+05:30 IST