కలల సౌధాన్ని నిర్మించుకున్న బాలీవుడ్ నటుడు.. తండ్రికి గుర్తుగా..

ABN , First Publish Date - 2022-01-28T01:48:11+05:30 IST

తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ. ప్రతిసారి భిన్న రకాల పాత్రలతో తన అభిమానులను పలకరిస్తుంటాడు

కలల సౌధాన్ని నిర్మించుకున్న బాలీవుడ్ నటుడు.. తండ్రికి గుర్తుగా..

తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ. ప్రతిసారి భిన్న రకాల పాత్రలతో తన అభిమానులను పలకరిస్తుంటాడు. తాజాగా అతడు తన కలల ఇంటిని ముంబైలో నిర్మించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్‌తో పంచుకున్నాడు. ఆ ఫొటోల కింద కామెంట్ కూడా రాశాడు. ‘‘మంచి నటుడు చెడ్డ మనిషిగా మారలేడు. ఎందుకంటే అతడి లోపలి మనిషి ఎప్పుడు మంచి పనులను చేయమని చెబుతాడు’’ అని వ్యాఖ్యానించాడు. అయితే.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన ఇంటికి అతడే ఇంటీరియర్ డిజైనర్‌గా వ్యవహరించాడు. తన అభిరుచులు, అవసరాలకనుగుణంగా ఈ ఇంటిని నిర్మించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పాత ఇంటి నుంచి స్ఫూర్తి పొంది కొత్తింటిని డిజైన్ చేసుకున్నాడు. అంతేకాకుండా.. తన తండ్రికి గుర్తుగా కొత్త ఇంటికి నవాబ్ అని పేరు పెట్టాడు. 


మీడియాకు దూరంగా ఉండే నవాజుద్దీన్ సిద్ధీఖీ కొన్నాళ్ల క్రితం బాలీవుడ్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. బీ టౌన్ లో జరిగే పార్టీలన్ని ఫేక్ అంటూ విమర్శించాడు. ప్రస్తుతం అతడి షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ‘టికు వెడ్స్ షేరు’ అనే చిత్రంలో నవాజుద్దీన్ నటిస్తున్నాడు. కంగన కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీకి సాబ్బిర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘హీరోపంటీ-2’ లోనూ అతడు కీలక పాత్రను పోషించనున్నాడు.



Updated Date - 2022-01-28T01:48:11+05:30 IST