మళ్ళీ నేచురల్ స్టార్ తో మహానటి

ABN , First Publish Date - 2021-10-17T19:21:50+05:30 IST

నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే.. సుందరానికీ’ మూవీని ట్రాక్ ఎక్కించారు. ఇక విజయదశమి సందర్బంగా శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో కొలాబరేట్ అవుతూ.. ‘దసరా’ అనే మూవీని అనౌన్స్ చేశారు. ఇందులో నానీ తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లోనే మాట్లాడబోతుండడం విశేషంగా చెప్పాలి.

మళ్ళీ నేచురల్ స్టార్ తో మహానటి

నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను విడుదలకు రెడీ చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే.. సుందరానికీ’ మూవీని ట్రాక్ ఎక్కించారు. ఇక విజయదశమి సందర్బంగా శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో కొలాబరేట్ అవుతూ..  ‘దసరా’ అనే మూవీని అనౌన్స్ చేశారు. ఇందులో నానీ తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లోనే మాట్లాడబోతుండడం విశేషంగా చెప్పాలి. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ ను ఖాయం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేషే కన్ఫమ్ చేస్తూ.. ట్వీట్ చేశారు. 


‘నేను లోకల్’ తర్వాత ‘దసరా’ చిత్రంతో  మళ్ళీ నానితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం సంతోషాన్నిస్తోంది’.. అంటూ కీర్తి వ్యాఖ్యను జోడిస్తూ.. ట్వీట్ చేశారు. ఇంతకు ముందు ‘నేను లోకల్’ మూవీతో నానీ, కీర్తిల  ఆన్ లైన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవడంతో సినిమా మంచి విజయం సాధించింది. మళ్ళీ ఇప్పుడు ‘దసరా’ సినిమాతో ఈ జోడీ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. మరి నేచురల్ స్టార్, మహానటి పెయిర్ ఈ సినిమాకి ఏ రేంజ్ లో అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.  



Updated Date - 2021-10-17T19:21:50+05:30 IST