అమెజాన్ ప్రైమ్‌లో.. నదియా నటించిన అంథాలజీ వెబ్‌ సిరీస్‌

ABN , First Publish Date - 2022-01-14T03:25:33+05:30 IST

‘పుత్తం పుదు కాలై విడియాదా..’ తమిళ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 14వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ, వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు అత్యుత్తమ ప్రాంతీయ కంటెంట్‌లతో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రసారం చేస్తున్న

అమెజాన్ ప్రైమ్‌లో.. నదియా నటించిన అంథాలజీ వెబ్‌ సిరీస్‌

‘పుత్తం పుదు కాలై విడియాదా..’ తమిళ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 14వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ, వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు అత్యుత్తమ ప్రాంతీయ కంటెంట్‌లతో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రసారం చేస్తున్న అమెజాన్‌ ప్రైమ్‌ తాజాగా ఐదు ఎపిసోడ్‌లు కలిగిన ఈ కొత్త వెబ్‌సిరీస్‌ను తమ ఆడియన్స్‌కు అందజేయనుంది. రెండోదశ లాక్‌డౌన్‌లో ఎదురైన అనుభవాలను ఇతివృత్తంగా తీసుకుని ప్రేమ, ఆశ, మానవత్వం వంటి అంశాలతో తెరకెక్కిన పలు వెబ్‌సిరీస్‌లు ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అయ్యాయి. ఇప్పుడు సరికొత్త అంశాలతో ఈ అంథాలజీ వెబ్‌ సిరీస్‌ రూపొందించారు. 


ఇందులో బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించి గౌరి కిషన్‌, టీజే అరునాసం నటించిన ‘ముగ కవస ముత్తం’.. హలీదా షమీమ్‌ దర్శకత్వం వహించి, లిజోమోల్‌ జోస్‌, అర్జున్‌ దాస్‌ నటించిన ‘లోనర్స్‌’.. మధుమిత దర్శకత్వంలో నదియా, జిజు జార్జ్‌ నటించిన ‘మైనమే పార్వవాయ్‌’.. ఐశ్వర్య లక్ష్మి, నిర్మల్‌ పిళ్ళై నటించి రిచర్డ్‌ ఆంటోనీ తెరకెక్కించిన ‘నిళల్‌ తరుమ్‌ ఇదం’.. శనత్‌ - దిలీప్‌ సబ్బరాయన్‌ నటించగా, సూర్య కృష్ణ దర్శకత్వం వహించిన ‘ది మాస్క్‌’ ఈ వెబ్‌సిరీస్‌గా ప్రసారం కానున్నాయి.

Updated Date - 2022-01-14T03:25:33+05:30 IST