ఓటీటీ నిర్ణయం మార్చుకున్న నిర్మాత.. థియేటర్‌లోనే రిలీజ్

ABN , First Publish Date - 2021-10-27T01:18:34+05:30 IST

హీరో సంతాను భాగ్యరాజ్‌ - హీరోయిన్‌ అతుల్యా రవి జంటగా నటించిన చిత్రం ‘మురుంగైక్కాయ్‌ చిప్స్‌’. కొత్త దర్శకుడు శ్రీజర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 19వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా

ఓటీటీ నిర్ణయం మార్చుకున్న నిర్మాత.. థియేటర్‌లోనే రిలీజ్

హీరో సంతాను భాగ్యరాజ్‌ - హీరోయిన్‌ అతుల్యా రవి జంటగా నటించిన చిత్రం ‘మురుంగైక్కాయ్‌ చిప్స్‌’. కొత్త దర్శకుడు శ్రీజర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 19వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి కరోనా లాక్‌డౌన్ ఆంక్షలతో పాటు సినిమా థియేటర్లలో 50 శాతం సీటింగ్‌ సామర్థ్యం అమల్లో ఉండటంతో ఈ మూవీని తొలుత ఓటీటీలో రిలీజ్‌ చేయాలని నిర్మాత భావించారు.


కానీ, నవంబరు ఒకటో తేదీ నుంచి థియేటర్లలో పూర్తిస్థాయి ప్రేక్షకుల సీటింగ్‌ సామర్థ్యంతో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో నవంబరు 19న థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. నిర్మాత రవీంద్రన్‌ చంద్రశేఖర్‌ తన సొంత నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించగా.. యోగిబాబు, మనోబాలా, మధుమిత, మునీష్‌కాంత్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. 

Updated Date - 2021-10-27T01:18:34+05:30 IST