కోటి తనయుడు రాజీవ్ హీరోగా ‘మురుగన్’ ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-17T21:41:55+05:30 IST
డికేసి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, విహారిక జంటగా సతీష్ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం "మురుగన్'. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫోర్ట్యూన్ ఇంద్ర విల్లాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి.. హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, బిజినెస్ మ్యాన్ చక్రధర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు, చిత్ర దర్శకుడు సతీష్ గౌరవ దర్శకత్వం వహించారు.
డికేసి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, విహారిక జంటగా సతీష్ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం "మురుగన్'. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫోర్ట్యూన్ ఇంద్ర విల్లాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి.. హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, బిజినెస్ మ్యాన్ చక్రధర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు, చిత్ర దర్శకుడు సతీష్ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, చిత్ర నిర్మాత నరేష్ చౌదరి, చిత్ర దర్శకుడు సతీష్, హీరో రాజీవ్, హీరోయిన్ విహారిక, చక్రధర్ రెడ్డి, డివోపీ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ తమ సందేశాల్ని వినిపించి.. చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇందులో ఇంకా మహేష్, కొల్ల జగన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.