‘మా’ ఎన్నికల ఫలితంపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-10-11T23:52:09+05:30 IST
‘మా' ఎన్నికల్లో గెలిచిన విష్ణుకు అభినందనలు తెలుపుతూ యం.పీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకాష్రాజ్ కన్నా తెలుగు సరిగ్గా మాట్లాడలేని వారు చాలా మంది ఉన్నారు. ఓటు వేయడానికి పనికొచ్చే ప్రకాష్రాజ్..

‘మా' ఎన్నికల్లో గెలిచిన విష్ణుకు అభినందనలు తెలుపుతూ యం.పీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకాష్రాజ్ కన్నా తెలుగు సరిగ్గా మాట్లాడలేని వారు చాలా మంది ఉన్నారు. ఓటు వేయడానికి పనికొచ్చే ప్రకాష్రాజ్ పోటీకి పనికి రాడా? తెలుగు మాట్లాడడం కూడా సరిగా రానివారి మాటలను ప్రకాష్రాజ్ పట్టించుకోవద్దు. 'మా' సభ్యులుగా ప్రకాష్రాజ్ కొనసాగాలి’ అని ఆయన ప్రకాశ్ రాజ్ రాజీనామా పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.