ఏపీలో సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై.. రిజర్వ్లో హైకోర్టు తీర్పు
ABN , First Publish Date - 2022-06-30T02:20:06+05:30 IST
ఏపీలో సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయ వ్యవహారంపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. జూలై 1వ తేదీన ప్రకటిస్తామని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్లైన్లో విక్రయాలు జరుపుతుందని ప్రభుత్వం జీవో

ఏపీలో సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయ వ్యవహారంపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. జూలై 1వ తేదీన ప్రకటిస్తామని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్లైన్లో విక్రయాలు జరుపుతుందని ప్రభుత్వం జీవో నెంబర్ 69ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే టికెట్ల అమ్మకం తర్వాత వచ్చిన ఆదాయాన్ని తిరిగి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో.. ఈ విషయంపై నిర్మాతల మండలి ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినా కూడా ప్రభుత్వం తరపు నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో.. జీవో నెంబర్ 69ను సవాల్ చేస్తూ.. మల్టీప్లెక్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ప్రైవేట్, ఆన్లైన్ విక్రయ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వ, ఇటు పిటిషన్ దాఖలు చేసిన వారి తరపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. బుధవారం తీర్పును రిజర్వ్ చేసి, జూలై 1వ తేదీన ప్రకటిస్తామని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.