పులిహోర అదుర్స్.. చాలా రోజుల తరువాత.. ఫెమినా మిస్ ఇండియా 2020 ఇంటర్వ్యూ!

ABN , First Publish Date - 2021-02-19T00:08:06+05:30 IST

మానసా వారణాసి.. మన హైదరాబాదీ అమ్మాయే! ఇటీవల ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటాన్ని గెలుచుకున్నారు. భాగ్యనగరంలోనే పుట్టి పెరిగిన మానసా గతంలో ఫైనాన్షియల్ ఎక్సేంజ్ ఇన్ఫర్మేషన్ ఎనలిస్టుగా పనిచేశారు. కాగా.. టైటిల్ గెలుచుకన్నాక తొలిసారిగా నగరానికి వచ్చిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా.. ఆమె ఆంధ్రజ్యోతికి ఇంటరవ్యూ ఇచ్చారు.

పులిహోర అదుర్స్.. చాలా రోజుల తరువాత..  ఫెమినా మిస్ ఇండియా 2020 ఇంటర్వ్యూ!

హైదరాబాద్: మానసా వారణాసి.. మన హైదరాబాదీ అమ్మాయే! ఇటీవల ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటాన్ని గెలుచుకున్నారు. భాగ్యనగరంలోనే పుట్టి పెరిగిన మానసా గతంలో ఫైనాన్షియల్ ఎక్సేంజ్ ఇన్ఫర్మేషన్ ఎనలిస్టుగా పనిచేశారు. కాగా.. టైటిల్ గెలుచుకన్నాక తొలిసారిగా నగరానికి వచ్చిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఐదు కిలోమీటర్ల బైక ర్యాలీతో బైకర్లు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. ఆమె ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. టైటిల్ గెలుచుకున్న ఫీలింగ్ అనిర్వచనీయమని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌ను వదిలి వెళ్లినప్పటికీ, తిరిగి వచ్చాక ఎంతో మార్పు వచ్చిందని చెప్పిన మానసా.. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యావాదాలు తెలిపారు. తన లక్ష్యం మిస్ వరల్డ్ అని అందుకోసం వీలైనంత త్వరగా ఈ పోటీకి ప్రిపేరషన్ ప్రారంభిస్తానని తెలిపారు. ఇంటి ఫుడ్ మిస్సయ్యారా అని అడగ్గా.. కొద్ది సేపటి క్రితమే తన అమ్మమ్మ చేసిన పులిహోర టేస్ట్ చేసి వచ్చానని, తన చేతి వంట అద్భుతమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన పూర్తి ఇంటర్వూ మీకోసం..



Updated Date - 2021-02-19T00:08:06+05:30 IST