‘ఆచార్య’: ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడంటే?
ABN , First Publish Date - 2022-04-09T02:31:39+05:30 IST
టాలీవుడ్లో పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రెండు వారాల గ్యాప్తో విడుదలవుతూ వస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్’ తర్వాత లైన్లో ఉన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ గ్యాప్లో
టాలీవుడ్లో పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రెండు వారాల గ్యాప్తో విడుదలవుతూ వస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్’ తర్వాత లైన్లో ఉన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ గ్యాప్లో ఇతర ఇండస్ట్రీలకి సంబంధించిన రెండు పెద్ద సినిమాలు.. ఒకటి తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ చిత్రం ఏప్రిల్ 13న, మరొకటి కన్నడ స్టార్ యశ్ నటించిన ‘కెజియఫ్ 2’ చిత్రం ఏప్రిల్ 14న విడుదలకానున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల తర్వాత మళ్లీ ‘ఆచార్య’ హంగామా మొదలవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ‘ఆచార్య’ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాలను పక్కాగా సెట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
టాలీవుడ్కి సంబంధించి ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్గా నిర్వహించేందుకు మేకర్స్ ఇప్పటికే తేదీని, వేదికను సిద్ధం చేసినట్లుగా టాక్ నడుస్తుంది. ప్రీ రిలీజ్ వేడుకను ఏప్రిల్ 24న యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనికి తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతులు కూడా వచ్చినట్లుగా సమాచారం. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటివారు అతిథులుగా రానున్నారనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినబడుతోంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.