సెన్సార్‌కి సిద్ధమవుతోన్న ‘మాతృదేవోభవ’

ABN , First Publish Date - 2021-09-27T00:03:14+05:30 IST

పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర వంటివారు ప్రధాన పాత్రల్లో.. శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె. హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మిస్తోన్న చిత్రం..

సెన్సార్‌కి సిద్ధమవుతోన్న ‘మాతృదేవోభవ’

పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర వంటివారు ప్రధాన పాత్రల్లో.. శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె. హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మిస్తోన్న చిత్రం ‘మాతృదేవోభవ’. ‘ఓ అమ్మ కథ’ అనేది ఉప శీర్షిక. సీనియర్ నటి సుధ తన కెరీర్‌లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్  పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. 


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కె. హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అవమానవీయ సంఘటనలకు అద్దం పడుతూ ప్రముఖ రచయిత కె.జె.ఎస్. రామారెడ్డి (సితారె) రాసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. భర్తను కోల్పోయి పిల్లల కోసమే బ్రతికి, వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఓ మాతృమూర్తికి, పిల్లల వల్ల ఎదురైన చేదు సంఘటనల సమాహారమే మా ‘మాతృదేవోభవ’. సుధగారి అభినయం, మరుదూరి రాజా సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి చాలా బాగా చేశారు. యువతరం మెచ్చే అంశాలు కూడా ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ చేయిస్తాం. మా నిర్మాత చోడవరపు వెంకటేశ్వరావుగారికి ఈ చిత్రం చక్కని శుభారంభాన్ని ఇచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.

Updated Date - 2021-09-27T00:03:14+05:30 IST