పుష్ప హిందీ రైట్స్తో కోట్లల్లో లాభం పొందిన నిర్మాత
ABN , First Publish Date - 2022-01-15T01:52:56+05:30 IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘‘పుష్ప : ది రైజ్ పార్ట్-1 ’’. లెక్కల మాస్టారు సుకుమార్ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘‘పుష్ప : ది రైజ్ పార్ట్-1 ’’. లెక్కల మాస్టారు సుకుమార్ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 17న ఆ సినిమా విడుదల అయింది. బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. హిందీ వెర్షన్ భారీగా వసూళ్లు చేసి రైట్స్ పొందిన నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను చేపట్టకపోయినప్పటికి బాలీవుడ్లో ఆ సినిమా 4వారాల్లోనే దాదాపుగా రూ. 84కోట్ల వసూళ్లను సాధించింది. ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది. గోల్డ్ మైన్స్ టెలీఫిలింస్కు చెందిన మనీశ్ షా ‘‘ పుష్ప’’ హిందీ హక్కులను కొన్నారు. ఆయనకు ఈ చిత్రంతో కోట్లల్లోనే లాభం వచ్చిందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.
‘‘మనీశ్ షా ‘ పుష్ప పార్ట్-1’ రైట్స్ను రూ. 28కోట్లకు కొనుగోలు చేశారు. డబ్బింగ్తో పాటు ఇతర ఖర్చుల కోసం దాదాపుగా రూ. 5కోట్లను ఖర్చు చేశారు. డిజిటల్ టెక్నాలజీ కోసం రూ. 11కోట్లను వెచ్చించారు. ఆ చిత్రంపై మొత్తంగా అతడి ఇన్వెస్ట్మెంట్ రూ. 44కోట్లు అని తేలింది. బాలీవుడ్లో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ దాదాపుగా రూ. 41కోట్లు అని తేలింది. శాటిలైట్ రైట్స్ను రూ. 30కోట్లకు ఒక ప్రముఖ టీవీ ఛానల్కు అమ్మారు. డిజిటల్ రైట్స్ను రూ. 10కోట్లకు అమ్మేశారు. చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులను అమ్మడంతో మనీశ్ షాకు దాదాపుగా రూ. 40కోట్ల లాభం వచ్చిందని తెలుస్తోంది ’’ అని మనీశ్ షాతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు. పుష్పలో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనంజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు.