Ponniyin Selvan I: ‘ఎవడ్రా నువ్వు’.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన విదేశీ సినీ క్రిటిక్పై సుహాసిని ఫైర్
ABN , First Publish Date - 2022-09-30T18:50:02+05:30 IST
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. నాలుగు దశాబ్దాల ఆయన కలని నిజం చేసుకున్నాడు. లైకా ప్రొడక్షన్స్, మాద్రాస్ టాకీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీలో.. చియాన్ విక్రమ్ (Vikram), కార్తీ (Karthi), జయం రవి, ఐశ్వర్యారాయ్(Aishwarya Rai), త్రిష (Trisha), శోభిత దూళిపాళ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమాపై రెండు రోజుల క్రితమే ఓ సినీ విశ్లేషకుడు ట్విట్టర్లో ఫస్ట్ రివ్యూ పెట్టేశాడు.
దుబాయ్కి చెందిన సెన్సాన్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు తనని తానే సినీ క్రిటిక్గా చెప్పుకుంటూ ఉంటాడు. దాంతో.. ఎక్కువగా ఇండియన్, దక్షిణాది సినిమాలపై రివ్యూలు సోషల్ మీడియాలో పెడుతుంటాడు. ఆయన రెండు రోజులకి ముందు ‘పొన్నియిన్ సెల్వన్’ రివ్యూ రాసుకొచ్చాడు. ఉమైర్ చేసిన ట్వీట్లో.. ‘మొదటి సమీక్ష #PS1! అద్భుతమైన ప్రొడక్షన్ డిజైనింగ్, వీఎఫ్ఎక్స్తో అద్భుతమైన సినిమాటిక్ సాగా! చియాన్ విక్రమ్, కార్తీ సినిమాని అన్ని విధాలుగా ఏలేశారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్ మళ్లీ మెరిసింది. ఆమె చాలా అద్భుతంగా ఉంది. మొత్తంమీద, కొన్ని మలుపులు, చప్పట్లు కొట్టే విలువైన క్షణాలతో కూడిన మంచి చారిత్రక చిత్రం’ అని రాసుకొచ్చాడు.
అయితే.. ఈ ట్వీట్ చూసిన మణిరత్నం భార్య, సినీ నటి సుహాసిని (Suhasini) రియాక్ట్ అయ్యింది. ఆమె ఉమైర్ ట్వీట్కి రిప్లై ఇస్తూ.. ‘ఇతను ఎవరు. ఇంకా విడుదల కాని ఈ చిత్రానికి మీకు ఉన్న సంబంధం ఏంటి’ అని రాసుకొచ్చింది. దీంతో సరిగ్గా రిప్లై ఇచ్చారు మేడం అంటూ ఎంతోమంది నెటిజన్లు ఆమె పోస్ట్కి కామెంట్స్ పెట్టారు. కొందరైతే ‘అలాంటి వాడిని బ్యాన్ చేసే అవకాశం ఉందేమో చూడండి’ మేడమ్ అంటూ కామెంట్స్ చేశారు.