Mani Ratnam: ‘పొన్నియిన్ సెల్వన్‌‌‌పై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-22T19:36:56+05:30 IST

‘పొన్నియిన్ సెల్వన్’.. దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్ట్. ఎప్పటి నుంచో కల్కి రాసిన నవల ఆధారంగా..

Mani Ratnam: ‘పొన్నియిన్ సెల్వన్‌‌‌పై సంచలన వ్యాఖ్యలు

‘పొన్నియిన్ సెల్వన్’.. దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్ట్. ఎప్పటి నుంచో కల్కి రాసిన నవల ఆధారంగా అదే పేరుతో సినిమాని పట్టాలెక్కించేందుకు ఈ సీనియర్ దర్శకుడు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో రెండు సార్లు ఆయన విఫలమయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ.. ఈ సినిమాని గతంలోనే తీయకపోవడం మంచిదైందని చెప్పుకొచ్చారు.


మణిరత్నం మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ నిరీక్షణకి ఇది ఒక విధమైన విముక్తి. పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) ఐదు భాగాల పుస్తకం. దాన్ని ఒకే చిత్రంలో కుదించడం అసాధ్యం. అప్పట్లో సినిమా చేసి ఉంటే న్యాయం చేయగలగే వాళ్లమో లేదో తెలియదు. నేడు.. ప్రేక్షకులు సినిమాను భాగాలుగా లేదా సిరీస్‌గా చూడడానికి సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే.. ఈ కాలంలోనే పొన్నియిన్ సెల్వన్‌ని తీయడం చాలా సులభం. ఆ పుస్తకంలో ఎక్కువగా మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే పొన్నియన్ సెల్వన్‌‌ని ఇన్నాళ్లూ తీయలేకపోయినందుకు.. అప్పుడు బాధపడిన ఇప్పుడు మాత్రం చాలా సంతోషిస్తున్నాను. ఆ సినిమాని తీయడానికి ఇదే సరైన సమయం అని నా భావన’ అని చెప్పుకొచ్చాడు. 


కాగా.. మణిరత్నం ఇంతకుముందు 1994, 2011లలో రెండుసార్లు పొన్నియిన్ సెల్వన్‌ని తెరకెక్కించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ రెండు ప్రయత్నాలలోనూ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఎట్టకేలకూ ఆ సినిమాని తీయాలని అనుకున్న దాదాపు 30 ఏళ్లకి సక్సెస్‌ఫుల్‌గా మూవీని తీశాడు. అయితే.. ‘పొన్నియిన్ సెల్వన్’ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్-I సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, శోభితా ధూళిపాళ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2022-09-22T19:36:56+05:30 IST