మహిళల భద్రతకోసం ‘మా’ కమిటి
ABN , First Publish Date - 2021-10-23T06:44:13+05:30 IST
ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతా కృష్ణన్ గౌరవ సలహాదారుగా ‘మా’ లో మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు అధ్యక్షుడు విష్ణు మంచు శుక్రవారం ట్విట్టర్లో తెలిపారు. ‘విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్....
ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతా కృష్ణన్ గౌరవ సలహాదారుగా ‘మా’ లో మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు అధ్యక్షుడు విష్ణు మంచు శుక్రవారం ట్విట్టర్లో తెలిపారు. ‘విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఈ కమిటీ మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు. ‘మా’లో మహిళల భాగస్వామ్యానికి దీన్ని తొలి అడుగుగా ఆయన పేర్కొన్నారు. ‘ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సభ్యులుగా ఉంటారు. వారి వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అని విష్ణు చెప్పారు.