మహిళల భద్రతకోసం ‘మా’ కమిటి

ABN , First Publish Date - 2021-10-23T06:44:13+05:30 IST

ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతా కృష్ణన్‌ గౌరవ సలహాదారుగా ‘మా’ లో మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు అధ్యక్షుడు విష్ణు మంచు శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు. ‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌....

మహిళల భద్రతకోసం ‘మా’ కమిటి

ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతా కృష్ణన్‌ గౌరవ సలహాదారుగా ‘మా’ లో మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు అధ్యక్షుడు విష్ణు మంచు శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు.  ‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ  ఈ కమిటీ మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు. ‘మా’లో మహిళల భాగస్వామ్యానికి దీన్ని తొలి అడుగుగా ఆయన పేర్కొన్నారు. ‘ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సభ్యులుగా ఉంటారు. వారి వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అని విష్ణు చెప్పారు. 

Updated Date - 2021-10-23T06:44:13+05:30 IST