కరోనా బారిన పడ్డ మరో మలయాళ నటుడు

ABN , First Publish Date - 2022-01-24T00:34:29+05:30 IST

‘భాగమతి, అల వైకుంఠపురములో’ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన మలయాళ నటుడు జయరామ్. ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఓ తమిళ సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జయరామ్.. నిన్న (శనివారం) తనకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇటీవల మమ్ముట్టి, దుల్ఖర్ సల్మాన్, సురేష్ గోపీ లాంటి హీరోలు కూడా కరోనా బారినపడ్డారు.

కరోనా బారిన పడ్డ మరో మలయాళ నటుడు

‘భాగమతి, అల వైకుంఠపురములో’ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన మలయాళ నటుడు జయరామ్. ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఓ తమిళ సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నిన్న (శనివారం) తనకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు జయరామ్.  


‘ఈ రోజు నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ ఇంకా మనతోనే ఉందని, దీంతో మనకు గుర్తు చేస్తోంది. నాతో బాగా కాంటాక్ట్ లో ఉన్నవారు ఐసోలేట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే టెస్ట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నేను ట్రీట్ మెంట్ మొదలు పెట్టాను. త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను’ అని జయరామ్ సోషల్ మీడియాలో తెలిపారు.  ఇటీవల మమ్ముట్టి, దుల్ఖర్ సల్మాన్, సురేష్ గోపీ లాంటి మలయాళ హీరోలు కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.  



Updated Date - 2022-01-24T00:34:29+05:30 IST