Vikram, Prithviraj సినిమాలు పెద్ద చేపలయితే.. మా చిత్రం మాత్రం బంగారు చేప అంటున్న Adivi Sesh..
ABN , First Publish Date - 2022-05-20T22:42:10+05:30 IST
ప్రయోగాత్మక సినిమాలు, విభిన్న పాత్రలతో అలరిస్తున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). అతడు తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’( Major). 26/11 హీరో సందీప్
ప్రయోగాత్మక సినిమాలు, విభిన్న పాత్రలతో అలరిస్తున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). అతడు తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’( Major). 26/11 హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ (Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. మహేశ్ బాబు(Mahesh Babu)కు చెందిన జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించింది. జూన్ 3న ఈ మూవీ విడుదల కాబోతుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘పృథ్వీరాజ్’, కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్’ అదే రోజు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా బాక్సాఫీస్ క్లాష్పై అడివి శేష్ను ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.
‘మేజర్’ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ చిత్రం నుంచి ‘ఓహ్ ఇషా’ పాటను విడుదల చేసింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ తాజాగా ముంబైలో జరిగింది. అప్పుడు మీడియా.. ‘విక్రమ్’, ‘పృథ్వీరాజ్’ సినిమాలతో క్లాష్పై ప్రశ్న అడిగింది. అడివి శేష్ సమాధానమిస్తూ ... ‘‘నిజం చెప్పాలంటే తెలుగులో పెద్ద సినిమా ‘మేజర్’, తమిళ్లో ‘విక్రమ్’, బాలీవుడ్లో ‘పృథ్వీరాజ్ అదే విధంగా భారీ చిత్రాలు. కానీ, సముద్రంలో అన్ని పెద్ద చేపలుంటే మాది మాత్రం బంగారు చేప’’ అని చెప్పాడు. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ‘మేజర్’ సినిమాలో సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణంతో పాటు అతడి జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.