నాకు పొగరు అనుకున్నారంతా: మహేశ్వరి
ABN , First Publish Date - 2022-01-19T00:15:51+05:30 IST
‘గులాబి’ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే కథానాయిక మహేశ్వరి. ఆ చిత్రం సక్సెస్తో ఆమె ఎన్నో అవకాశాలు అందుకొంది. అలాగే శ్రీదేవి కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం కూడా ఆమెకు ప్లస్ అయింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ప్యాషన్ డిజైనింగ్లో కొనసాగుతున్నారు.
‘గులాబి’ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే కథానాయిక మహేశ్వరి. ఆ చిత్రం సక్సెస్తో ఆమె ఎన్నో అవకాశాలు అందుకొంది. అలాగే శ్రీదేవి కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం కూడా ఆమెకు ప్లస్ అయింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ప్యాషన్ డిజైనింగ్లో కొనసాగుతున్నారు. తాజాగా ఓ టీవీ షోకి అతిథిగా హాజరైన ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘‘నేను చాలా సైలైంట్ అమ్మాయిని. పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. షూటింగ్లో కూడా టేక్ అవ్వగానే ఓ పక్కన కూర్చునేదాన్ని. అదే నన్ను విమర్శలకు గురి చేసింది. శ్రీదేవి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని అనీ, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం పట్ల నాకు పొగరు అని చాలామంది అనుకునేవారు. నా ముందే చాలామంది వెటకారం చేశారు. ‘నాకు పొగరు లేదు’ అని పక్కన బోర్డ్ పెట్టుకోవలసింది. అప్పట్లో నేను అలా చేయలేదు(నవ్వుతూ). అయితే ఇండస్ట్రీలో మా పిన్ని శ్రీదేవి కొన్ని విషయాలు నేర్పారు. ఆ దార్లోనే నడుచుకున్నా. శ్రీదేవిగారు నాకు పిన్ని అయినా అక్కా అని పిలిచేదాన్ని. ఇప్పుడు ఆమె మన మధ్య లేరు అనడాన్ని నమ్మకలేకపోతున్నా. ఎక్కడో షూటింగ్లోనో ఉన్నారనీ, విదేశాలకు వెళ్లారేమో అనే భావనలో ఉన్నాను. అక్క మరణించింది అంటే నమ్మలేకపోతున్నా’’ అని తెలిపారు.