Mahesh - Trivikram: సెట్స్‌పైకి వచ్చేదప్పుడేనా..?

ABN , First Publish Date - 2022-05-17T21:28:03+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతుంది.

Mahesh - Trivikram: సెట్స్‌పైకి వచ్చేదప్పుడేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతుంది. ఫస్టాఫ్ బావున్నప్పటికీ సెకండ్ హాఫ్ అనుకునంత రేంజులో ఉండకపోవడంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా సర్కారు వారి పాట వసూళ్లకు మాత్రం ఎలాంటి డోఖా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అత్యంత వేగంగా షేర్ అండ్ గ్రాస్ రాబట్టిన సినిమాగా సర్కారు వారి పాట నిలిచింది. ఇక మహేష్ నెక్స్ట్ మూవీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ (Trivikram)తో చేయబోతున్న విషయం తెలిసిందే. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో, ఫిబ్రవరిలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. 


ఓవైపు దర్శకధీరుడు రాజమౌళితో సినిమాకు సంబంధించిన చర్చలు జరుపుతూనే.. త్రివిక్రమ్ తో మూవీని పట్టాలెక్కించేందుకు మహేష్ ప్లాన్ చేస్తున్నాడట. SSMB28 రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ బౌండ్ స్క్రిప్ట్ ని లాక్ చేసారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. కేవలం నలుగున్నర నెలల్లోనే ఈ సినిమాని కంప్లీట్ చేసి, రాజమౌళి మూవీకి ప్రిపేర్ అవ్వాలని మహేశ్ ప్లాన్. దీనికి తగ్గట్లే త్రివిక్రమ్ SSMB28ని జూలైలో స్టార్ట్ చేసి డిసెంబర్ వరకు పూర్తి చేసేలా పక్కా ప్లాన్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. 


ఈ సినిమాతో, త్రివిక్రమ్... మహేష్, క్లాస్‌లోని మాస్‌ను ఎలివేట్ చేస్తూ 'అల వైకుంఠపురములో' తరహాలో సినిమాను రూపొందించనున్నారట. కాగా, ఈ సినిమా టైటిల్‌ను మే 31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు మేకర్స్ ఉన్నారట. దీనిపై మేకర్స్ నుంచి అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా 'పెళ్లి సందD' బ్యూటీ శ్రీలీలా కనిపించనుంది.

Updated Date - 2022-05-17T21:28:03+05:30 IST