అడవి శేష్‌కి మహేశ్‌ ప్రశంసలు!

ABN , First Publish Date - 2021-12-06T22:27:10+05:30 IST

అడివి శేష్‌ కథానాయకుడిగా 2008 ముంబై ఎటాక్స్‌లో ప్రాణాలు అర్పించిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు ఒక నిర్మాత. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్‌ ఈ సినిమా అవుట్‌పుట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘

అడవి శేష్‌కి మహేశ్‌ ప్రశంసలు!

అడివి శేష్‌ కథానాయకుడిగా 2008 ముంబై ఎటాక్స్‌లో ప్రాణాలు అర్పించిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు ఒక నిర్మాత. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్‌ ఈ సినిమా అవుట్‌పుట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘నేను కొంత అవుట్‌పుట్‌ చూశాను. అంతవరకూ శేష్‌ అద్భుతంగా మేజర్‌ పాత్ర పోషించారు. అతన్ని చూస్తే గర్వంగా ఉంది. హ్యాట్సాఫ్‌ టు శేష్‌. సినిమా విడుదల కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నా’’ అని మహేశ్‌ పేర్కొన్నారు. శాయి మంజ్రేకర్‌, శోభితా ధూళిపాల నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదలకానుంది. 


Updated Date - 2021-12-06T22:27:10+05:30 IST