ఇప్పటి పవన్ స్పీచ్ కు .. అప్పటి మహేశ్ ట్వీట్ వైరల్

ABN , First Publish Date - 2021-09-26T20:05:28+05:30 IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ ఇచ్చిన అగ్రెసివ్ స్పీచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనిపై సినీ వర్గాల్లో పవన్ కళ్యాణ్ కు భారీ మద్దతు లభిస్తోంది. అయితే పవన్ ఇచ్చిన ఈ పవర్ స్పీచ్ కు .. సూపర్ స్టార్ మహేశ్ బాబు పదకొండేళ్ళ క్రిందట పెట్టిన ఓ ట్వీట్ రిలేటెడ్ గా ఉండడంతో అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇప్పటి పవన్ స్పీచ్ కు .. అప్పటి మహేశ్ ట్వీట్ వైరల్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్న ‘రిపబ్లిక్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ ఇచ్చిన అగ్రెసివ్ స్పీచ్ గురించే మాట్లాడుకుంటున్నారు.  దీనిపై సినీ వర్గాల్లో పవన్ కళ్యాణ్ కు భారీ మద్దతు లభిస్తోంది. అయితే పవన్ ఇచ్చిన ఈ పవర్ స్పీచ్ కు .. సూపర్ స్టార్ మహేశ్ బాబు పదకొండేళ్ళ క్రిందట పెట్టిన ఓ ట్వీట్ రిలేటెడ్ గా ఉండడంతో అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  2010 లో ‘ఢీ’ ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ మాట్లాడిన మాటలకు రియాక్ట్ అవుతూ.. అప్పట్లో మహేశ్ చేసిన ట్వీట్ అది.


‘ఎవరో చెబితే విన్నాను .. నిన్న పవన్ కళ్యాణ్ ‘ఢీ’ ఆడియో ఫంక్షన్ లో చాలా బాగా మాట్లాడారని. అది విని నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. ఆయన నేను బాగా ఇష్టపడే వ్యక్తి.’ అని ట్వీట్ చేశారు మహేశ్ బాబు. అయితే ఇది పదకొండేళ్ల క్రితం పెట్టిన ట్వీట్ అయినా... ఇప్పటి సందర్బానికీ అది బాగా సింకవుతోంది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ .. స్ర్కీన్ షేర్ చేసుకుంటే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరి ఆ ఇద్దరూ ఎప్పుడు కలిసి నటిస్తారో చూడాలి. 



Updated Date - 2021-09-26T20:05:28+05:30 IST