Mahesh Babu: రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే.. 25 చిత్రాలు చేసినట్లే..

ABN , First Publish Date - 2022-08-09T01:32:09+05:30 IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఒకరు. ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘దూకుడు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) లో

Mahesh Babu: రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే.. 25 చిత్రాలు చేసినట్లే..

టాలీవుడ్ టాప్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఒకరు. ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘దూకుడు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మహేశ్ బాబు ఆగస్టు 9న పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli)తో చేయబోయే ప్రాజెక్టు గురించి మాట్లాడాడు.   


రాజమౌళితో పనిచేయాలనే కల నెరవేరబోతున్నందకు సంతోషంగా ఉన్నానని మహేశ్ బాబు తెలిపాడు. ‘‘రాజమౌళి గారితో ఒక్క సినిమాకు పనిచేస్తే 25 చిత్రాలకు పనిచేసినట్లే. ఈ మూవీలోని పాత్ర కోసం శ్రమించాలి. ఎందుకంటే సినిమా దానిని డిమాండ్ చేస్తుంది. చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా దేశంలోని ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని మహేశ్ బాబు పేర్కొన్నాడు. రాజమౌళి, మహేశ్ బాబు సినిమా యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఆఫ్రికా అడవి నేపథ్యంలో కథ కొనసాగనుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ స్పెషల్ షోస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. దాదాపుగా 200షో స్క్రీనింగ్స్‌ను వేయనున్నారు. ఈ షోల ద్వారా వచ్చిన ఆదాయం మహేశ్ బాబు‌ పౌండేషన్‌కు విరాళంగా అందజేస్తున్నారు. ‘పోకిరి’ కీ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఘట్టమనేని మంజుల, పూరీ జగన్నాథ్ కలసి నిర్మించారు. 63రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను పూరీ జగన్నాథ్ పూర్తి చేశాడు. 2006 ఏప్రిల్ 28‌న ఈ చిత్రం విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 

Updated Date - 2022-08-09T01:32:09+05:30 IST