Mahesh '28': పూజా హెగ్డేను రీప్లేస్ చేసిన సమంత..?

ABN , First Publish Date - 2021-11-26T18:53:52+05:30 IST

పూజా హెగ్డేను సమంత రీప్లేస్ చేసిందా ..? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నాడు.

Mahesh '28': పూజా హెగ్డేను రీప్లేస్ చేసిన సమంత..?

పూజా హెగ్డేను సమంత రీప్లేస్ చేసిందా ..? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ సాగుతున్న ఈ మూవీ చివరిదశకు చేరుకుందని సమాచారం. ఈ షెడ్యూల్‌తో టాకీపార్ట్ మొత్తం పూర్తవుతుందట. దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సినిమాను కూడా మొదలుపెట్టేందుకు మహేశ్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ నెక్స్ట్ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందట. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిచబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులు ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. 


కానీ, తాజా సమాచారం ప్రకారం పూజా ప్లేస్‌ను సమంత రీప్లేస్ చేసిందని తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా.. మహేశ్ - త్రివిక్రమ్ మూవీకి డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిందట. దాంతో చిత్రబృంద సమంతను సంప్రదించగా కథ నచ్చి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇక పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్', 'ఆచార్య' చిత్రాలు కొత్త సంవత్సరంలో రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే హిందీలో రెండు చిత్రాలు, తమిళంలో ఓ సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే, సమంత నటించిన 'శాకుంతలం', 'కతు వాకుల రెండు కాదల్' రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. కొత్తగా మూడు ప్రాజెక్ట్స్‌ను కమిటయింది. అందులో ఓ హాలీవుడ్ మూవీ కూడ ఉండటం విశేషం. అంతేకాదు అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. 

Updated Date - 2021-11-26T18:53:52+05:30 IST