'మహా సముద్రం' ఎఫెక్ట్..అజయ్ భూపతి - ధనుశ్ మూవీ క్యాన్సిల్..?

ABN , First Publish Date - 2021-10-20T15:30:33+05:30 IST

'మహా సముద్రం' మూవీ ఎఫెక్ట్ అజయ్ భూపతి - ధనుశ్ కాంబోలో అనుకున్న ప్రాజెక్ట్ మీద పడిందా..అవుననే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 'ఆర్.ఎక్స్.100' మూవీ తర్వాత మళ్ళీ రెండవ సినిమా అవకాశం రావడానికి

'మహా సముద్రం' ఎఫెక్ట్..అజయ్ భూపతి - ధనుశ్ మూవీ క్యాన్సిల్..?

'మహా సముద్రం' మూవీ ఎఫెక్ట్ అజయ్ భూపతి - ధనుశ్ కాంబోలో అనుకున్న ప్రాజెక్ట్ మీద పడిందా..అవుననే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 'ఆర్.ఎక్స్.100' మూవీ తర్వాత మళ్ళీ రెండవ సినిమా అవకాశం రావడానికి దర్శకుడు అజయ్ భూపతికి చాలా సమయం పట్టింది. ఎవరెవరో హీరోల చుట్టూ తిరిగి చివరికి శర్వానంద్, సిద్దార్థ్‌లతో 'మహా సముద్రం' సినిమా తీశాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన 'మహా సముద్రం' బ్లాక్ బస్టర్ అని చాలా నమ్మకంగా చెప్పాడు. కానీ మూవీ రిలీజయ్యాక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 



చాలాకాలంగా సరైన సక్సెస్ లేనీ హీరోలతో పాటు హీరోయిన్స్ అదితీరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కూడా 'మహా సముద్రం' సక్సెస్ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ, అందరినీ తీవ్రంగా నిరాశపరచింది. అంతేకాదు ఈ మూవీ గనక హిట్ అయితే చిత్ర నిర్మాత అనిల్ సుంకర..అజయ్ భూపతి - తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఓ మూవీ ప్లాన్ చేశాడట. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసేందుకు అటు నిర్మాత గానీ, ఇటు హీరో ధనుష్ గానీ అంత ఆసక్తిగా లేరని టాక్ వినిపిస్తోంది. మరి అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.  


Updated Date - 2021-10-20T15:30:33+05:30 IST