‘మది’ అందరి మదిలో నిలిచిపోతుందట

ABN , First Publish Date - 2022-10-02T04:42:39+05:30 IST

ఆర్‌వి రెడ్డి సమర్పణలో.. ఆర్వీ సినిమాస్‌తో కలిసి ప్రగతి పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి హీరోహీరోయిన్లుగా రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా

‘మది’ అందరి మదిలో నిలిచిపోతుందట

ఆర్‌వి రెడ్డి సమర్పణలో.. ఆర్వీ సినిమాస్‌తో కలిసి ప్రగతి పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి హీరోహీరోయిన్లుగా రామ్ కిషన్ నిర్మిస్తున్న సినిమా ‘మది’. నాగ ధనుష్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాతలు తెలుపుతున్నారు. 


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగ ధనుష్ మాట్లాడుతూ.. రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ‘మది’ ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా ఉంటూ, వినూత్నరీతిలో కథనం సాగుతుంది. కథ-సందర్భానుసారంగా ఈ సినిమాలో  ఐదు సాంగ్స్ ఉన్నాయి. పివిఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రఘు కుంచె, సునీత, రమ్య బెహార, దీపు, సాయి చరణ్, హరిణి ఆలపించడం జరిగింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం..’’ అని తెలిపారు. 

Updated Date - 2022-10-02T04:42:39+05:30 IST