'లవ్ స్టోరి': నాగార్జున, సుకుమార్ ముఖ్య అతిథులుగా మ్యాజికల్ సక్సెస్ మీట్..
ABN , First Publish Date - 2021-09-28T16:02:10+05:30 IST
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరి'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరి'. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం 'లవ్ స్టోరి' మ్యాజికల్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఈ మ్యాజికల్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున అక్కినేని, స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరు కానున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లవ్ స్టోరి' మూవీని శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు లు నిర్మించారు. పవన్ సి హెచ్ సంగీతం అందించారు.