భారతీయ తెరపై తొలిసారి

ABN , First Publish Date - 2021-09-28T05:14:17+05:30 IST

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌... అనేది ఉపశీర్షిక. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ భారతీయ చిత్ర పరిశ్రమకు...

భారతీయ తెరపై తొలిసారి

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌... అనేది ఉపశీర్షిక. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ భారతీయ చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం కానున్నారు. మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో నైపుణ్యంకల మైక్‌ పాత్రలో ఆయన నటిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ‘‘మీకు పిచ్చెకిస్తామని వాగ్దానం చేశాం. దాన్ని నెరవేర్చే ప్రక్రియ ఇప్పుడే ప్రారంభించాం.


భారతీయ తెరపై తొలిసారి... భూగ్రహంపై అత్యంత దుర్మార్గుడు, బాక్సింగ్‌ దేవుడు, లెజెండ్‌... ఐరన్‌ మైక్‌ టైసన్‌’’ అని విజయ్‌ దేరకొండ పేర్కొన్నారు. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. బాక్సింగ్‌ రింగ్‌లో భారీ యాక్షన్‌ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విదేశీ ఫైటర్లు కూడా పాల్గొంటున్నారు. హీరోయిన్‌గా అనన్యా పాండే, కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-09-28T05:14:17+05:30 IST