లావణ్య క్లారిటీ ఇచ్చింది!
ABN , First Publish Date - 2022-01-20T20:51:42+05:30 IST
మెగా ప్రిన్స్ వరుణ్తేజ్తో లావణ్యా త్రిపాఠీ పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. సంక్రాంతి సందర్భంగా తన సొంతూరు డ్రెహాడూన్కి వెళ్లానని, కుటుంబంతో హాయిగా గడుపుతున్నా అని ఆమె కొన్ని ఫొటోలు పోస్ట్ చేసి సమాధానమిచ్చారు. దీనితో రెండు రోజులుగా వస్తున్న పెళ్లి వదంతులకు ఫుల్స్టాప్ పడినట్లు అయింది.
మెగా ప్రిన్స్ వరుణ్తేజ్తో లావణ్యా త్రిపాఠీ పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. సంక్రాంతి సందర్భంగా తన సొంతూరు డ్రెహాడూన్కి వెళ్లానని, కుటుంబంతో హాయిగా గడుపుతున్నా అని ఆమె కొన్ని ఫొటోలు పోస్ట్ చేసి సమాధానమిచ్చారు. దీనితో రెండు రోజులుగా వస్తున్న పెళ్లి వదంతులకు ఫుల్స్టాప్ పడినట్లు అయింది. వరుణ్తేజ్ గతంలో పోస్ట్ చేసిని కొన్ని ఫొటోలే ఈ గాసిప్లకు కారణమైంది. వీరిద్దరూ కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లోనూ వీరిద్దరి మఽధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారనీ, పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. అదే సమయంలో వరుణ్తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లిలో కూడా లావణ్యా తళుక్కుమనడంతో ఆ వార్తలకు ఇంకాస్త బలం చేకూరింది. కొన్నాళ్లకు ఆ విషయాన్ని మరచిపోయారు.
బుధవారం వరుణ్తేజ్ పుట్టినరోజు సందర్భంగా బెంగుళూరు వెళ్లారు. అక్కడి ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేయగా రచ్చ మళ్లీ మొదలైంది. లావణ్యాతో బర్త్డే సెలబ్రేషన్స్ కోసమే ఆయన బెంగుళూరు వెళ్లారనీ, లావణ్యా కోసం ఖరీదైన డైమండ్ రింగ్ కొన్నారనీ గాసిప్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న లావణ్యా సోషల్ మీడియా వేదికగా అసలు విషయం చెప్పకుండా స్పందించింది. ‘‘ప్రస్తుతం డెహ్రాడూన్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నా. మా ఊరి అందాలను ఆస్వాదిస్తున్నా’’ అని ఆమె ఇన్స్టాలో ఫొటోలు షేర్ చేశారు. దాంతో వరుణ్తో పెళ్లి, పుట్టినరోజు సెలబ్రేషన్స్ అంటూ వచ్చిన వార్తలకు చెక్ పడింది.