మెరుగవుతున్న సీనియర్ గాయని ఆరోగ్యం!
ABN , First Publish Date - 2022-01-17T00:32:41+05:30 IST
ఇటీవల కోవిడ్ బారిన పడిన గాయని లతా మంగేష్కర్ కోలుకుంటున్నారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. ఈ నెల 11న కరోనా సోకిన ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. లతా ఆరోగ్యం గురించి ఆదివారం మంత్రి రాజేశ్ మీడియాతో మాట్లాడారు. ‘లతాజీ ఆరోగ్యం మెరుగుపడుతోంది.
ఇటీవల కోవిడ్ బారిన పడిన గాయని లతా మంగేష్కర్ కోలుకుంటున్నారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. ఈ నెల 11న కరోనా సోకిన ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. లతా ఆరోగ్యం గురించి ఆదివారం మంత్రి రాజేశ్ మీడియాతో మాట్లాడారు. ‘లతాజీ ఆరోగ్యం మెరుగుపడుతోంది. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నాను. కుటుంబ సభ్యులతో చర్చించి ఎప్పటికప్పుడు లతాగారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరాను’’ అని మంత్రి చెప్పారు.