ఈలం తమిళుల కథల్లో నటించను : లాస్లియా
ABN , First Publish Date - 2021-09-22T20:09:09+05:30 IST
శ్రీలంకలో జరిగిన ఈలం తమిళ పోరును నేపథ్యంగా చేసుకుని అనేక చిత్రాలు వచ్చాయి. వస్తున్నాయి. ఇటీవల కూడా ‘ఫ్యామిలీ మెన్-2’ అనే వెబ్సిరీస్ కూడా ఇచ్చింది. ఇందులోని అనేక వివాదాస్పద సన్నివేశాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
శ్రీలంకలో జరిగిన ఈలం తమిళ పోరును నేపథ్యంగా చేసుకుని అనేక చిత్రాలు వచ్చాయి. వస్తున్నాయి. ఇటీవల కూడా ‘ఫ్యామిలీ మెన్-2’ అనే వెబ్సిరీస్ కూడా ఇచ్చింది. ఇందులోని అనేక వివాదాస్పద సన్నివేశాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వెబ్సిరీ్సను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యం లో శ్రీలంకలో న్యూస్ యాంకర్గా చేస్తూ బిగ్బాస్ కార్యక్రమంలో పాల్గొని ఒక్కసారిగా పాపులర్ అయిన లాస్లియా శ్రీలంకకు చెందిన ఈలం తమిళ అమ్మాయి. బిగ్బాస్ తర్వాత ఈమెకు సినీ అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
తాజాగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రఽధాన పాత్రల్లో నటించిన ‘ఫ్రెండ్షిప్’ చిత్రంలోనూ నటించింది. అలాగే, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవి కుమార్ నిర్మిస్తున్న ‘గూగుల్ కుట్టప్పా’ చిత్రంలోనూ లాస్లియా హీరోయిన్గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈలం సమస్యను ప్రధానాంశంగా చేసుకునే నిర్మించే చిత్రాల్లో నటిస్తారా అంటూ మీడియా ప్రశ్నించగా క్షణం ఆలోచన చేయకుండా లాస్లియా నో చెప్పింది. ‘చిన్నప్పటి నుంచి ఈలం తమిళుల పోరాటాన్ని, వారు పడిన కష్టాలను చూస్తూ పెరిగాను అందుకే ఈలం నేపథ్యంలో సాగే కథల్లో నటించకూడదన్న నిర్ణయం తీసుకున్నాను’ అని లాస్లియా చెప్పుకొచ్చింది.