విడుదలపై గురి పెట్టారు!
ABN , First Publish Date - 2021-09-28T05:12:01+05:30 IST
విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. ఇందులో హీరో నాగశౌర్య విలుకాడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. దాంతో విడుదలపై గురి పెట్టారు. నవంబర్....
విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. ఇందులో హీరో నాగశౌర్య విలుకాడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. దాంతో విడుదలపై గురి పెట్టారు. నవంబర్ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ప్రకటించారు. సినిమాలో నాగశౌర్య రెండు గెటప్పుల్లో కనిపిస్తారని, పాత్ర కోసం విలువిద్యలో శిక్షణ తీసుకున్నారని దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెలిపారు. కథానాయికగా కేతికా శర్మ, కీలక పాత్రల్లో జగపతిబాబు, సచిన్ ఖడేకర్ నటిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడు.