విజయేంద్ర ప్రసాద్‌ కథతో శ్రీవారి ఫిలిమ్స్‌ చిత్రం

ABN , First Publish Date - 2022-01-20T01:44:18+05:30 IST

లెజెండ్రీ రచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్‌ ఒక తమిళ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవారి ఫిలిమ్స్‌ అధినేత పా. రంగనాథన్‌ వెల్లడించారు. శ్రీవారి ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మించే

విజయేంద్ర ప్రసాద్‌ కథతో శ్రీవారి ఫిలిమ్స్‌ చిత్రం

లెజెండ్రీ రచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్‌ ఒక తమిళ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే సమకూర్చనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవారి ఫిలిమ్స్‌ అధినేత పా. రంగనాథన్‌ వెల్లడించారు. శ్రీవారి ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మించే మూడో చిత్రం విజయేంద్రప్రసాద్‌ అందించే కథతో రూపుదిద్దుకోనుంది. ఇందులో భారీ తారాగణం నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో చేస్తామని నిర్మాత పా. రంగనాథన్‌ తెలిపారు. 


ఈ సంస్థ ఇప్పటివరకు రెండు చిత్రాలు నిర్మించింది. వాటిలో ఒకటి హాస్య నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన ‘ధర్మప్రభు’, రెండోది గౌతమ్‌ కార్తీక్‌, చేరన్‌ వంటి భారీ తారాగణం నటించి ఇటీవల విడుదలైన ‘ఆనందం విలైయాడుం వీడు’. ఇప్పుడు మూడో ప్రాజెక్టు పనుల్లో నిర్మాత నిమగ్నమయ్యారు. అదేసమయంలో విజయేంద్రప్రసాద్‌ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వచ్చిన పలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రాలకు కథ, స్ర్కీన్‌ప్లేను సమకూర్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-01-20T01:44:18+05:30 IST