అమెజాన్ ప్రైమ్‌లో ‘క్షీరసాగర మథనం’

ABN , First Publish Date - 2021-09-04T20:52:52+05:30 IST

మానస్ నాగులపల్లి, బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా, అక్షత సోనావని హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి

అమెజాన్ ప్రైమ్‌లో ‘క్షీరసాగర మథనం’

మానస్ నాగులపల్లి, బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా, అక్షత సోనావని హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ పంగులూరి దర్శకుడు. ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడిగా నటించారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలకాబోతోంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా కారణంగా సకుటుంబ సమేతంగా మా చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు రాలేకపోయినవాళ్ళంతా నేటి నుంచి (సెప్టెంబర్ 4) అమెజాన్ ప్రైమ్‌లో చూసి ఆస్వాదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పలు సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఓ ఇరవై మంది మిత్రుల ప్రోత్సాహంతో ఈ చిత్రం రూపొందించడం జరిగింది. ఆగస్టు 6న థియేటర్స్‌లో విడుదల చేశాము. చాలా మంచి స్పందన వచ్చింది. కేవలం సాఫ్ట్‌వేర్ వాళ్లనే కాకుండా... సెన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని చూసి చక్కగా ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను..’’ అన్నారు. 

Updated Date - 2021-09-04T20:52:52+05:30 IST