ఆ సినిమాలో యాక్షన్ స్టార్గా కృతి సనన్
ABN , First Publish Date - 2022-01-21T00:36:56+05:30 IST
మహేశ్ బాబు సరసన ‘వన్: నేనొక్కడినే’ సినిమాలో నటించి వెండితెరకు పరిచయమైన నటి కృతి సనన్. అనంతరం అనేక బాలీవుడ్ చిత్రాల్లో
మహేశ్ బాబు సరసన ‘వన్: నేనొక్కడినే’ సినిమాలో నటించి వెండితెరకు పరిచయమైన నటి కృతి సనన్. అనంతరం అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె డేట్స్ ఖాళీగా లేవు. 2022లో ఆరు చిత్రాలతో అలరించనుంది. ఈ ఏడాది ‘బచ్చన్ పాండే’ , ‘ఆది పురుష్’, ‘షెహజాదా’తో సహా మరికొన్ని సినిమాలతో సత్తా చాటనుంది. అయితే, కృతీ తన అప్కమింగ్ మూవీస్లో ఒక ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్తో కలిసి పని చేయనుంది. ఈ చిత్రంలో యాక్షన్ పాత్రలో ఆమె కనిపిస్తుందని బీ టౌన్లో ప్రచారం సాగుతోంది. ఆ క్రమంలోనే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది. అనేక విషయాలను అభిమానులకు తెలిపింది.
‘‘నేను నటించబోయే సినిమాలో అనురాగ్ కశ్యప్ ప్రత్యేకతలన్ని ఉంటాయి. ఆ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. అందుకోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం నేను ‘గణ్పత్’ షూటింగ్లో పాల్గొంటున్నాను. ‘గణ్పత్’లో యాక్షన్ సన్నివేశాలను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అనురాగ్ కశ్యప్ తెరకెక్కించబోయే చిత్రంలోను యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి ’’ అని కృతి సనన్ చెప్పింది. అనురాగ్ దర్శకత్వంలో కృతి సనన్ నటించబోయే చిత్రం ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్ అని బీ టౌన్ మీడియా చెబుతోంది. క్వింటన్ టోరంటినో తెరకెక్కించిన ‘కిల్ బిల్’కు రీమేక్గా ఆ చిత్రం రూపొందనుందని బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే గనుక నిజమైతే కత్తితో కృతి సనన్ చేసే విన్యాసాలను తెర మీద మనం చూడొచ్చు.