మళ్ళీ మెగా కాంపౌండ్‌లోకి కృతి శెట్టి?

ABN , First Publish Date - 2022-01-11T20:48:23+05:30 IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ లాంఛింగ్ మూవీ ‘ఉప్పెన’ తో టాలీవుడ్‌లోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతిశెట్టి. తొలి చిత్రంతోనే ఈ సొట్టబుగ్గల సుందరి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ తో కృతి బోలెడన్ని ఆఫర్స్ అందుకుంది. నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ లో కథానాయిక గా నటించిన కృతి.. నాగచైతన్యతో ‘బంగార్రాజు’ లో జోడీ కడుతోంది. అలాగే.. రామ్ పోతినేని లింగుసామి కాంబో మూవీలోనూ కథానాయికగా నటిస్తోంది. తాజాగా కృతి శెట్టిని మరో మెగా ఆఫర్ వరించిట్టు వార్తలొస్తున్నాయి.

మళ్ళీ మెగా కాంపౌండ్‌లోకి కృతి శెట్టి?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ లాంఛింగ్ మూవీ ‘ఉప్పెన’ తో టాలీవుడ్‌లోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతిశెట్టి. తొలి చిత్రంతోనే ఈ సొట్టబుగ్గల సుందరి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ తో కృతి బోలెడన్ని ఆఫర్స్ అందుకుంది. నేచురల్ స్టార్ నానీ తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ లో కథానాయిక గా నటించిన కృతి.. నాగచైతన్యతో ‘బంగార్రాజు’ లో జోడీ కడుతోంది. అలాగే.. రామ్ పోతినేని లింగుసామి కాంబో మూవీలోనూ కథానాయికగా నటిస్తోంది. తాజాగా కృతి శెట్టిని మరో మెగా ఆఫర్ వరించిట్టు వార్తలొస్తున్నాయి. 


మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ‘సేనాపతి’ చిత్రంతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆహాలో ఇటీవల విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. రాజేంద్రప్రసాద్ నటనకి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ విజయోత్సాహంతో సుస్మిత మరో సినిమాని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుస్మిత నిర్మించబోయే ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నట్టు సమాచారం. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దీనికి దర్శకుడు. ఇదేమీ సిరీయస్ డ్రామా కాదని, నేటి తరం యువతి పాత్రలోనే కృతి కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. 

Updated Date - 2022-01-11T20:48:23+05:30 IST