పుష్ప ‘సామీ సామీ’ పాటకి కొరియన్ పాప్ సింగర్స్ డ్యాన్స్.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2022-01-21T16:58:32+05:30 IST
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, నటుడు అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే...
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, నటుడు అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మూవీతో పాటు ఇందులోని పాటలు సైతం యువతను ఓ ఊపు ఊపేశాయి. దీంతో ఈ సినిమాకి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా బీటీఎస్ బోయ్స్గా వరల్డ్ వైడ్ పాపులారిటీ సాధించిన కొరియన్ సింగర్స్.. ఈ సినిమాలో రష్మిక మందన్నా చేసిన ‘సామీ సామీ’ పాటకి స్టేజ్ మీద డ్యాన్స్ వేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ కాగా వైరల్గా మారింది. అందులో బ్యాక్గ్రౌండ్లో పాట ప్లే అవుతుండగా.. ముగ్గురు కుర్రాళ్లు ఎంత గ్రేస్ డ్యాన్స్ వేశారు.
అయితే, బీటీఎస్ బోయ్స్గా గుర్తింపుపొందిన కొరియన్ పాప్ సింగర్స్ జిమిన్, జిన్, జుంగ్కుక్ జె హోప్, వీ, ఆర్ఎమ్, సుగాకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారికి భారత దేశంలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే అప్పుడప్పుడు ఇండియన్ సాంగ్స్కి స్టేజ్ మీద పరామెన్స్ చేస్తుంటారు ఈ సింగర్స్. ఇంతకుముందు సైతం ‘కమారియా’ సాంగ్పై వీళ్లు చేసిన పరామెన్స్ వీడియో వైరల్గా మారింది. కాగా, పుష్ప వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..