సమంతకి షాకిచ్చిన కూకట్ పల్లి కోర్ట్

ABN , First Publish Date - 2021-10-22T16:44:25+05:30 IST

అక్కినేని నాగచైతన్య, సమంత జంట గతనెల్లో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వారి వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పలురకాల వార్తలు పుట్టుకొచ్చాయి. సమంత పెర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకి మధ్య గల బంధంపై యూ ట్యూబ్ లోనూ, ట్విట్టర్ లోనూ అభ్యంతరకరమైన రీతిలో కథనాలు వ్యాప్తిచెందాయి.

సమంతకి షాకిచ్చిన కూకట్ పల్లి కోర్ట్

అక్కినేని నాగచైతన్య, సమంత జంట గతనెల్లో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వారి వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పలురకాల వార్తలు పుట్టుకొచ్చాయి. సమంత పెర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకి మధ్య గల బంధంపై యూ ట్యూబ్ లోనూ, ట్విట్టర్ లోనూ అభ్యంతరకరమైన రీతిలో కథనాలు వ్యాప్తిచెందాయి. ఈ నేపథ్యంలో దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న సమంత.. కొన్ని యూట్యూబ్  ఛానల్స్ పై పరువునష్టం దావా కేసు ఫైల్ చేశారు. 



ఈ కేసు ఈ నెల 21న కూకట్ పల్లి కోర్ట్ లో హియరింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా, సమంత వేసిన దావాపై కోర్ట్ తన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఆమె సదరు యూ ట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయడం కంటే..సంబంధిత వ్యక్తులు వీడియో సంస్థలనుంచి క్షమాపణలు అడగవచ్చని కూకట్ పల్లి కోర్ట్ అభిప్రాయపడింది.  ఈ కేసుపై తుదితీర్పు నేడు (శుక్రవారం) వెలువడనుంది. ప్రస్తుతం సమంత రెండు ద్విభాషా చిత్రాలకు కమిట్ అయింది. అలాగే కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆమె డిసైడైనట్టు వార్తలొస్తున్నాయి. 

Updated Date - 2021-10-22T16:44:25+05:30 IST