ఖుష్భూ నుంచి నయన్ వరకు..సినీ జంటలివి
ABN , First Publish Date - 2021-09-27T01:10:02+05:30 IST
బాక్సాఫీస్ వద్ద సినిమాలు విజయం సాధించడంలో దర్శకులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అందువల్ల సినిమా నిర్మాణం సమయంలో చిత్ర బృందంలోని సభ్యుల మధ్య కొత్త స్నేహాలు చిగురిస్తుంటాయి. సినిమా చిత్రీకరణ సమయంలో కథానాయికలు బృందంలోని సభ్యులతో ప్రేమలో పడతారు.
చెన్నై: బాక్సాఫీస్ వద్ద సినిమాలు విజయం సాధించడంలో దర్శకులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అందువల్ల సినిమా నిర్మాణం సమయంలో చిత్ర బృందంలోని సభ్యుల మధ్య కొత్త స్నేహాలు చిగురిస్తుంటాయి. సినిమా చిత్రీకరణ సమయంలో కథానాయికలు బృందంలోని సభ్యులతో ప్రేమలో పడతారు. సినిమాలను నిర్మించడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే కథను అనుసరించి పగలు, రాత్రి చిత్రీకరణ జరపాల్సి ఉంటుంది. మన కెరీర్ను అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా లభిస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. అందువల్ల సినిమా ఇండస్ట్రీకి చెందినవారు తమ జీవిత భాగస్వామిగా సినిమా ఇండస్ట్రీ వ్యక్తులనే తరచుగా వివాహం చేసుకుంటుంటారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు కథానాయికలు తమ పరిశ్రమకు చెందినవారినే వివాహం చేసుకున్నారు. వారెవరో తెలుసుకుందామా...
దేవయాని-రాజ్కుమార్:
సూర్యవంశం షూటింగ్ సమయంలో దేవయానికి రాజ్కుమార్ పరిచయ్యారు. అనంతరం ఆ పరిచయం స్నేహనికి దారితీసింది. ఈ సినిమాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం ఆయన దర్శకుడిగా మారి దేవయానితో కూడా చిత్రాన్ని నిర్మించారు. ‘‘ విన్నుక్కుం మన్నుక్కుం ’’ చిత్ర షూటింగ్ సమయంలో ఆమెకు తన ప్రేమను తెలియజేశారు. ఆమె వెంటనే ఆయన ప్రేమను అంగీకరించింది. కానీ, ఆమె తల్లిదండ్రులు వీరి ప్రేమకు అంగీకరించలేదు.అనంతరం తమ వివాహాన్ని వీరు గుళ్లో చేసుకున్నారు.
ఖుష్బూ-సుందర్ సి
ఖుష్బూ, సుందర్ సి కలిసి మొదట మురై మమన్ అనే చిత్రానికి పనిచేశారు. అనంతరం వీరిద్దరూ స్నేహితులుగా మారారు. ఒక సందర్భంలో థియేటర్లోభారీ గుంపు నుంచి ఆమెను సుందర్ సి కాపాడారు. ఈ ఘటన తర్వాత వీరి స్నేహం మరింత గట్టిపడి ప్రేమగా మారింది. కొన్ని రోజుల అనంతరం సుందర్ సి, ఖుష్బూకి తన ప్రేమను తెలియజేయడంతో ఆమె వెంటనే ఒప్పుకుంది. ఒక ఏడాది అనంతరం వీరు వివాహం చేసుకున్నారు.
శరణ్య, పొన్వన్నన్
శరణ్య,పొన్వన్నన్ అనేక చిత్రాల్లో కలిసి పనిచేశారు. శరణ్య ప్రొఫెషనలిజానికి పొన్వన్నన్ ముగ్ధుడయ్యారు. ఆమెను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించడం మొదలుపెట్టారు. అనంతరం పొన్వన్నన్, శరణ్యకు ప్రపోజ్ చేశారు. ఆయన ఒక రోజు ఫోన్ చేసి నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావా అని అడిగారు. 10 రోజుల అనంతరం ఆమె తన అంగీకారాన్ని తెలిపారు.
రమ్యకృష్ణన్, కృష్ణవంశీ
శివగామిగా అందరికి సుపరిచితురాలైన రమ్యకృష్ణన్ తన 13వ ఏటనే సినిమా కెరీర్ను ప్రారంభించారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చంద్రలేఖ చిత్రంతో ఒకరికి మరొకరు పరిచయమయ్యారు. అనంతరం స్నేహితులుగా మారారు. కొంతకాలం సహజీవనం చేసి జూన్ 2003లో వివాహం చేసుకున్నారు.
నయనతార-విఘ్నేష్శివన్
విఘ్నేష్శివన్ దర్శకత్వం వహించిన ‘‘ నాన్ రౌడీ దాన్’’ చిత్రంలో నయనతార నటించింది. ఆమె అందరినీ కలుపుకోవడం చూసి నయనతారతో ఆయన ప్రేమలో పడ్డారు. గత 5 సంవత్సరాలుగా వీరు సహజీవనం చేస్తున్నారు. త్వరలో వీరు వివాహం చేసుకోనున్నారు.