Dhoomam: ‘పుష్ప’ విలన్.. సూర్య హీరోయిన్‌తో KGF నిర్మాతల సినిమా.. ఈ సారి అలా..

ABN , First Publish Date - 2022-09-30T19:45:11+05:30 IST

యశ్ నటించిన ‘కేజీఎఫ్ (KGF)’ సినిమాలు ఎలాంటి సంచలన విజయాన్ని అందుకున్నాయే అందరకీ తెలిసిందే...

Dhoomam: ‘పుష్ప’ విలన్.. సూర్య హీరోయిన్‌తో KGF నిర్మాతల సినిమా.. ఈ సారి అలా..

యశ్ నటించిన ‘కేజీఎఫ్ (KGF)’ సినిమాలు ఎలాంటి సంచలన విజయాన్ని అందుకున్నాయే అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ అయితే రూ.1200 కోట్లకిపైగా వసూళ్లు సాధించి.. దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలని హోంబలే ఫిల్మ్(Hombale Films) నిర్మించింది. అయితే.. ఈ సినిమా తర్వాత ఇంతవరకూ మరో సినిమాని పట్టాలెక్కించలేదు ఈ నిర్మాణ సంస్థ. ‘కేజీఎఫ్’ విడుదలైన దాదాపు ఐదు నెలల తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ కొత్త సినిమాని ప్రకటించింది.


ఆ కొత్త సినిమా పేరు ‘ధూమం’. ఇందులో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన మలయాళీ నటుడు ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil) హీరోగా నటించనున్నాడు. అలాగే.. ఆయన పక్కన హీరోయిన్‌గా సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన అపర్ణ బాలమురళీ (Aparna Balamurali) నటించనుంది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదిక పంచుకుంది.


హోంబలే ఫిల్మ్స్ చేసిన ఆ పోస్ట్‌లో.. ‘ఏ విత్తనం వేస్తే అదే పంట చేతి కొస్తుంది. మా ధూమమ్ షూటింగ్ అక్టోబర్ 9న ప్రారంభమవుతుంది. 2023 వేసవిలో పూర్తవుతుంది’ రాసుకొచ్చింది. అంతేకాకుండా.. ఆ పోస్ట్‌కి ఫహాద్‌, అపర్ణ, నిర్మాత విజయ్ కిరంగదూర్ వంటి పలువురిని ట్యాగ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘లూసియా’, ‘యు-టర్న్’ గుర్తింపు పొందిన పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.


ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన సందర్భంగా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ.. ‘ధూమమ్‌ సినిమా కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఫహద్‌ను కొత్తగా, భారీ పాత్రలో చూడబోతున్నారు. గొప్ప నటీనటుల కలయిక మేజిక్‌ని క్రియేట్ చేస్తుందని మేం భావిస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు.



Updated Date - 2022-09-30T19:45:11+05:30 IST