కరోనా నుంచి కోలుకున్న ‘మహానటి’

ABN , First Publish Date - 2022-01-18T19:03:43+05:30 IST

ద్దిరోజులుగా వరుసగా సినీ సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. వారిలో పలువురు అతి తక్కువ సమయంలోనే కోలుకున్నారు. మరికొందరు ఇంకా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల మంచు లక్ష్మి, త్రిష తాము కోలుకున్నట్టు ట్వీట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మహానటి కీర్తి సురేశ్ కూడా చేరారు. కొద్దిరోజుల క్రితం కీర్తి సురేశ్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు తనకి నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ ట్వీట్ చేశారు.

కరోనా నుంచి కోలుకున్న ‘మహానటి’

కొద్దిరోజులుగా వరుసగా సినీ సెలబ్రిటీస్ కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. వారిలో పలువురు అతి తక్కువ సమయంలోనే కోలుకున్నారు. మరికొందరు ఇంకా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల మంచు లక్ష్మి, త్రిష తాము కోలుకున్నట్టు ట్వీట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మహానటి కీర్తి సురేశ్ కూడా చేరారు. కొద్దిరోజుల క్రితం కీర్తి సురేశ్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు తనకి నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ ట్వీట్ చేశారు. 


ఈ రోజు (మంగళవారం) కీర్తి సురేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ఈ రోజుల్లో నెగెటివ్ అనే మాట చాలా పాజిటివ్.. మీ ప్రేమాభిమానాలకు, మీ ప్రార్ధనలకు ధన్యవాదాలు. మీరందరూ సంక్రాంతిని బాగా జరుపుకున్నారని భావిస్తున్నాను. అంటూ కీర్తి ట్వీట్ చేశారు.    



Updated Date - 2022-01-18T19:03:43+05:30 IST